నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని బాలయ్య కెరియర్ లో భారీ బడ్జెట్ తో బోయపాటి తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసినా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది.మరల స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.అందులో ఒకటి రైతు పాత్ర కాగా మరో పాత్రలో అఘోరాగా కనిపించబోతున్నాడు.
ఈ కథలో దైవశక్తి గురించి కూడా అంతర్లీనంగా బోయపాటి టచ్ చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రల కోసం చాలా మంది పేర్లు పరిశీలించారు.
కొత్త హీరోయిన్ పేర్లు కూడా వినిపించాయి.చివరికి సినిమాలో హీరోయిన్లు ఫైనల్ చేసినట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.అందులో ఒక హీరోయిన్ గా అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేసి రీసెంట్ గా తమిళ్ హీరో ఆర్యని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ భామ సాయేషా సైగల్ హీరోయిన్ గా ఖరారు అయ్యింది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.అఖిల్ ఫ్లాప్ తో తెలుగు సినిమాకి దూరమైన ఈ భామ తమిళంలో రెండు సినిమాలు చేసింది.
తరువాత ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అవుతుందనుకున్న ఈ భామ మరల బాలయ్య మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది.
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇక బాలయ్య సినిమాలో నటించడంపై సాయేషా కూడా కన్ఫర్మ్ చేసింది.
బాలయ్య, బోయపాటి చిత్రంలో పని చేసే అవకాశం రావడం గర్వకారణంగా ఉంది.త్వరలో జరగబోయే షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న అని ట్వీట్ చేసింది.