మహానటి సావిత్రి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె జీవితం మొత్తం తెరిచిన పుస్తకం.
మహానటి సినిమా ద్వారా పాత జనరేషన్ వారికే కాకుండా కొత్త జనరేషన్ కి కూడా తెలిసింది.ఇక కేవలం నటిగానే కాకుండా, చేతికి ఎముక లేని దానాలు కూడా ఎలా చేసిందో మనం చూసాం.
ఎవరైనా సినివినిలాకాశంలో ఎంత ఎత్తుకు ఎదిగిన అది వచ్చే తరాలకు ఒక మార్గదర్శకం గా మారుతారు.అలాగే తన నటనతో ఎన్నో పాత్రల్లో జీవించిన సావిత్రి తన భవిష్యత్తు తరాలకు అమే నటనా వారసత్వాన్ని అందించారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
అలాగే సావిత్రి ఈనాడు తన నటనకు తగ్గ రెమ్యురేషన్ కావాలని నిర్మాతను డిమాండ్ చేయలేదు.ఆమె ఇతరుల పట్ల చూపించే ఔదార్యం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది.
సావిత్రి కి అభిమానులు ఇచ్చే గౌరవం తప్ప ప్రభుత్వ అవార్డులు ఏనాడూ దక్కలేదు.నాకు ఆ పురస్కారం ఇవ్వండి, ఈ అవార్డ్ ఎందుకు ఇవ్వరు అని అమే ఎవరిని ప్రశ్నించింది లేదు.
ఎలా బ్రతకాలో చెప్పడానికి ఒక సావిత్రి జీవితం మాత్రమే ఉదాహరణ.అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎలా బ్రతకాలో చెప్పడానికి ఉదాహరణ సావిత్రి జీవితం అయితే, ఎలా చనిపోకుడదో చెప్పడానికి కూడా అమే జీవితమే ఉదాహరణ.
ఈ విషయం చెప్పింది ఎవరో కాదు సహజ తార జయసుధ. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో జయసుధ సావిత్రి గురించి మాట్లాడుతూ, అమే మద్యం తాగి వైనం, కన్ను మూసిన తీరు అందరినీ బాధించింది అని, ఆమెను చూసి ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకున్నాము అంటూ చెప్పింది.దీంతో సావిత్రి అభిమానులు ఒకింత ఆవేదన చెందుతున్నారు.అంతే కాదు జయసుధ లాంటి వ్యక్తి ఇంటర్వ్యూ లో అలా చెప్పడం ఏంటి అంటూ వాపోతున్నారు.ఇది ఒక రకంగా ఆమెను అవమానించడమే అంటున్నారు అభిమానులు.