ఇప్పుడు ఏదైనా నిరసన జరుగుతుంది అంటే.ఆ నిరసన గురించి పెళ్లి పత్రికలో వేసి పెళ్లితో పాటు ఆ నిరసన గురించి కూడా తెలపడం ట్రెండ్ అయిపోయింది.
అలానే ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి.సేవ్ ఫార్మర్స్ అనే నిరసన జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఆ పని ఏంటి అంటే సేవ్ ఆవరవతి నిరసనకు మద్దతు ఇస్తూ తన పెళ్లి పత్రికలో సేవ్ అమరావతి-సేవ్ ఫార్మర్స్ ప్రచురించి పంచి పెట్టడమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జాస్తి సురేష్ అనే వ్యక్తి ఈ వెరైటీ నిరసనను చేశాడు.జాస్తి సరేష్ మాట్లాడుతూ.
నేను పుట్టింది, పెరిగింది వ్యవసాయ కుటుంబంలోనే.నా తండ్రి పడ్డ కష్టాన్ని చెప్పేందుకే ఈ తరహా నిరసనను ప్రదర్శించాను.
ప్రస్తుతం నేను కెనడాలో ఉద్యోగం చేస్తున్న.ఇటీవలే నా నిశ్చితార్థం జరిగితే ఏ రైతు కనీసం భోజనం చెయ్యడానికి కూడా రాలేదు.
అందరూ ఆవేదనలో ఉన్నారు” అని అయన చెప్పుకొచ్చాడు.