కరోనా కారణంగా ఎంతో మంది ప్రవాసులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి కరోనా ఆంక్షల నేపధ్యంలో చిక్కుకుపోయారు.ఇలా ఎంతో మంది వివిధ దేశాల వారు ఉద్యోగాలను వదులుకుని, ఆర్ధికంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా వీసా ల రెన్యువల్ గడువు ముగుస్తున్న సమయంలో ప్రవాసులు ఈ విషయంలో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.ఈ క్రమంలోనే సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది.
కరోన వలన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కారణంగా విదేశాలలో చిక్కుకున్న ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసాల గడువును పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
వర్క్ పర్మిట్ , విజిట్ వీసా పర్మిట్ ల గడువును ఆగస్టు 31 వరకూ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని సౌదీ పాస్ పోర్ట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది.అంతేకాదు ఈ రెన్యువల్ కోసం ప్రవాసులు ఎలాంటి అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రకటించింది.
అంతేకాకుండా పొడిగించిన ఈ గడువు బయట ఉన్న ప్రవాసుల రెసిడెన్సీ , పర్మిట్ విజిట్ వీసాలకు కూడా వర్తిస్తుందని తెలిపింది.అయితే
ప్రవాసులు ఇందుకోసం పాస్ పోర్టు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని కేంద్ర సమాచార శాఖ సహకారంతో ఈ పొడిగింపు దానంత అదే వచ్చేలా చేయడం జరుగుతుందని తెలిపింది.కేవలం కరోనా నేపధ్యంలో చిక్కుకుపోయిన ప్రవాసుల కోసం కింగ్ సల్మాన్ బిన్ అబ్డులాజిజ్ అల్ సౌద్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పాస్ పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ మీడియా ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 31 వరకూ యూఏఈ లో ప్రవేశం లేదని దేశాలకు చెందిన ప్రవాసులకు రెసిడెన్సీ పర్మిట్ తో పాటుగా వర్క్ పర్మిట్, రీ ఎంట్రీ వీసాలకు కూడా ఈ పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టరేట్ వెల్లడించింది.
సౌదీ తాజాగా ప్రకటనతో ఎంతో మంది ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా భారత ప్రవాసులకు తాజా నిర్ణయం ఎంతో ఊరట నిస్తుందనే చెప్పాలి.