ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాలలో దుబాయ్ దేశం ఒకటి.అయితే ఈ దేశం యొక్క ముఖ్య వనరు ఇంధనం.
దీంతో పెట్రోల్, డీజిల్, ఇందన వాయువులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది.అయితే ఈ దేశంలో ఒక లీటర్ మంచి నీళ్ల కన్నా లీటర్ పెట్రోల్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
దీంతో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజులు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్నారు.దీనికి తోడు బంగారం, వజ్రాలు వంటివి కూడా సమృద్ధిగా దొరకడంతో ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ప్రపంచ దేశాల కంటే భిన్నంగా ఉంటాయి.
దీంతో ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎక్కువ మంది యువత ఈ అరబ్ దేశాలకు ఉద్యోగం చేయడానికి వలస వెళుతుంటారు.
అయితే దుబాయ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు మంచి ఆనంద ప్రియులు అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.
దీంతో ప్రతి ఏటా వీరి యొక్క విలాసాలకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు.అయితే ఇందులో ఎక్కువగా ఖరీదైన భవనాలు, కార్లు, బంగారం మరియు ఇతర వ్యాపకాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
కాగా తాజాగా దుబాయ్ దేశానికి చెందినటువంటి ఓ రాజు అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్ మరియు వ్యాఖ్యాత కిమ్ కర్దాషియాన్ కు కళ్ళు చెదిరిపోయే ఆఫర్ ఇచ్చాడట.అయితే కిమ్ కర్దాషియాన్ ఒకరోజు రాత్రి రాజుకు సంబంధించిన వేడుకలో డాన్స్ చేసి మెప్పిస్తే ఒక్కరోజుకి ఏకంగా 65 కోట్ల రూపాయలు పారితోషకం ఇచ్చాడట.
దీంతో ఈ విషయం తెలిసి కొందరు నెటిజన్లు ఔరా అంటున్నారు.అంతేకాక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఒక రోజుకి 65 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం రావడం చాలా అరుదని కొందరు నీటి జల్లులా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నటి కిమ్ కర్దాషియన్ కి సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 2 కోట్ల పై చిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ దేశంలో మహిళలపై ఇష్టం లేకుండా బలవంతంగా అత్యాచారం చేసిన లేదా వారిపై అసాంఘిక ఆకృత్యాలకు పాల్పడిన కఠిన చర్యలు విధిస్తారు.అంతేకాకుండా మహిళలపై అత్యాచారం చేసినట్లు రుజువైతే ఎలాంటి విచారణ లేకుండా బహిరంగంగా మొండెం నుంచి తలను వేరు చేస్తారు.అంతటి కఠిన శిక్షలు ఉండడం వల్లే ఈ దేశంలో మహిళలకు రక్షణ ఉంది.