సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా రూపొందిన గుర్తుందా శీతాకాలం సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతున్న నేపథ్యం లో హడావుడి విపరీతంగా చేయాల్సి ఉంటుంది.
కానీ ఏ మాత్రం హడావుడి లేకుండా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం లేదు.
తమన్నా సినిమా అయినప్పటికీ అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనుమానాలు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఏమి జరగక పోవడంతో క్రియేట్ అవ్వలేదు.
సినిమా కు మరో మూడు రోజుల సమయం మిగిలి ఉంది, కనుక ఈ సమయంలో ఏమైనా హడావిడి చేసి సినిమా యొక్క బజ్ క్రియేట్ చేస్తారా అనేది చూడాలి.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు జరుగుతున్నాయి.ప్రముఖ యంగ్ హీరో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చేందుకు ఓకే చెప్పాడని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయినా సినిమా యొక్క అంచనాలు పెరిగి ఆసక్తి పెరుగుతుందేమో చూడాలి.
తమన్నా ఈ మధ్య కాలంలో తెలుగులో సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు లేవు.అందుకే ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె కెరియర్ మరి కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో కొనసాగే అవకాశం ఉందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు సత్యదేవ్ కూడా ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకుంటే మరొక సక్సెస్ ఆయన ఖాతాలో పడ్డట్టు అవుతుంది.దాంతో మరిన్ని సినిమాలు ఆయన నుండి వస్తాయి అన్నట్లు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.