సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా తిరుగులేని ఇమేజ్ తో స్టార్ హీరోలు అందరితో జత కట్టి ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్న అందాల భామ త్రిష.ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు దాటేస్తున్న ఇప్పటికే అదే లుక్ తో కుర్ర హీరోలతో కూడా జత కడుతూ సినిమాలు చేస్తుంది.
రెండేళ్ల క్రితం ఆమె నటించిన 96 సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.తెలుగులో ఈమెకి అవకాశాలు తగ్గిపోయిన మాతృబాష తమిళంలో పాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది.
ఇక ఈ ఏడాది ఆమె సినిమాలు రెండు రిలీజ్ కాగా మరో నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.అందులో మణిరత్నం పాన్ ఇండియా మూవీ కూడా.
ఈమె నటిస్తున్న సినిమాలు చూస్తూ ఉంటె త్రిష స్పీడ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఆమె నటించిన చిత్రం ఒకటి ఇప్పుడు ఓటీటీ ద్వారా రిలీజ్ కి రెడీ అవుతుంది.
మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి త్రిష చేసిన చిత్రం శతురంగ వెట్టయ్ -2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా ఏవో కారణాల వలన రిలీజ్ కి నోచుకోలేదు.
అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలు గతంలో రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలకి కూడా ఫ్యాన్సీ రేటు చెల్లించి కొనేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో త్రిష, అరవింద్ స్వామి నటించిన ఈ సినిమాని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకుంది.
ఇక త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది.