అమెరికాలోని కాలిఫోర్నియాలో గల శాంతా క్రజ్ దీవిలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 34 మంది మరణించగా అందులో భారత సంతతికి చెందిన ఓ యువ జంట కూడా మృతి చెందారని తెలుస్తోంది.సంజిరీ దేవ్ పూజారి, ఆమె భర్త కౌస్తుభం నిర్మల్ కూడా మృతిచెందినట్లు భావిస్తున్నారు.
అమెరికాలో రెండేళ్ల క్రితం స్థిరపడిన ఆ యువ జంట మరణ వార్తవిని వారి కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
భారత్ లోని నాగ్ పూర్ లో ప్రముఖ వైద్యుడిగా సతీష్ దేవ్ పూజారికి ఎంతో మంచి పేరు ఉంది.
ఆయన కుమార్తె అయిన సంజీవి కూడా అమెరికాలో డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్నారు.ఆమె భర్త అమెరికాలో ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ ఇద్దరు దంపతులు పడవ ప్రయాణం కోసం వెళ్లారు.వీరితో పాటుగా ౩౩ మంది సైతం ఆ ప్రయాణంలో పాల్గొన్నారు.
ఇంతలో ఒక్క సారిగా వారు ప్రయాణిస్తున్న పడవలో మంటలు చెలరేగాయి.వీరితో పాటు ఉన్న డ్రైవర్లు 7 గురు ఎంతగా ప్రయత్నించినా మంటల్ని ఆపడం సాధ్యం కాలేక పోయింది.దాంతో ఆ ఘటనలో ఇద్దరు భారతీయ దంపతులతో పాటు ౩౩ మంది ప్రాణాలు కోల్పోయారు.కేవలం డ్రైవర్స్ మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు.