రచయితగా, దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సతీష్ వేగేశ్న.ఫామిలీ చిత్రాలతో కుటుంబ బంధాలని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సతీష్ వేగేశ్న నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.
అయితే అతను తీసిన శతమానం భవతి తర్వాత ఇప్పటి వరకు ఫామిలీ కథలనే నమ్ముకున్న సరైన హిట్ పడలేదు.అయితే ఈ సారి ఫామిలీ కథని పక్కన పెట్టిన కూడా కాస్తా ఎమోషనల్ ఎలిమెంట్ తోనేసినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
శ్రీహరి తనయుడు మేఘాంష్, సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా శ్రీహరి జయంతి సందర్భంగా సినిమాను అధికారికంగా ప్రకటించారు.సతీష్ వేగేశ్న పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
యంగ్ హీరోలతో చేస్తున్న ఈ సినిమాకి కోతి కొమ్మచ్చి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.ఈ సినిమాని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
కరోనా ప్రభావం కాస్త తగ్గిన తర్వాత షూటింగ్ ను మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తున్నారు.ఇక కోతి కొమ్మచ్చి అంటే గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన ప్రతి ఒక్కరి జీవితంతో బంధం ఏర్పరుచుకున్న సరదా ఆట.అలాంటి ఆటకి సంబందించిన టైటిల్ ని సినిమాకి పెట్టారంటే ఇందులో ప్రతి వ్యక్తిలో ఉండే బాల్య స్మృతులని మరో సారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడేమో అనే టాక్ వినిపిస్తుంది.ఫీల్ గుడ్ కథలని, మరిచిపోయిన జ్ఞాపకాలని తన సినిమాలతో గుర్తు చేసే సతీష్ వేగేశ్న మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడని టైటిల్ బట్టి అర్ధం అవుతుంది.