హుజూరాబాద్ రాజకీయాలు ఇప్పడు తెలంగాణలో ఎంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఇక్కడ గెలిస్తేనే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టం కడుతారనే నేపథ్యంలో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా మినీ 2023 ఎన్నికల్లాగే తీసుకుంటున్నాయి.ఇక ఇక్కడ అనూహ్యంగా టీఆర్ ఎస్కు రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్పైనే అందరి దృష్టి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఆయనకు చెక్ పెట్టేందుకు టీఆర్ ఎస్ సర్వ శక్తులను ఒడ్డుతోంది.ఎలాగైనా గెలిచి బీజేపీ ప్రభావం లేదని చూపేందుకు, అలాగే కేసీఆర్ కాదని ఎవరూ గెలవలేరిన నిరూపించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది.
ఇక అనూహ్యంగా కాంగ్రెస్ కూడా పోటీలోకి వచ్చిందని అనుకునేలోపే ఆ పార్టీకి కౌశిక్రెడ్డి రాజీనామా చేయడంతో ఊహించనిపరిణామాలు చోటుచేసేంకుంటున్నాయి.ఇక ఇప్పుడు ఇంకా కాంగ్రెస్, టీఆర్ ఎస్ తమ అభ్యర్థులను మాత్రం ప్రకటించకుండానే ప్రచారం చేసేందుకు ప్లాన్లు వేస్తున్నాయి.
అయితే ఈ మధ్య ఓ సర్వే రిపోర్టు హుజూరాబాద్ ఎన్నికల్లో సంచనం రేపుతోంది.ఓ మార్గ్ ఏజెన్సీ కంపెనీ పేరుమీద రిలీజ్ అయిన ఆ సర్వేలో మల్లీ ఈటల రాజేందరే గెలుస్తారని ఉంది.ప్రస్తుతం ఇది అక్కడ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.ఇది బీజేపీ వాళ్లే చేసుకున్నారని టీఆర్ ఎస్ నేతలు కావాలని ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ సర్వే మాత్రం నిజంగానే ఈటలకు క్లియర్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో బీజేపీ నేతలు ఫుల్ కుషీలో ఉన్నారు.ఏదేమైనా ఈటల రాజేందర్కు తిరుగు లేదని మరోసారి నిరూపితమైంది.దీంతో ప్రతిపక్షాల్లో కాస్త టెన్షన్ మొదలవుతుంది.ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు అన్ని ఈటల గెలుపును నిరూపిస్తున్నాయి.