నాని, సాయి పల్లవి, కృతి శెట్టి నటించిన సినిమా శ్యామ్ సింఘరాయ్ ఈ మధ్యకాలంలో నాని సినిమాల్లో ఇది అతి పెద్ద విజయవంతమైన చిత్రంగా చెప్పుకోవచ్చు.సాయి పల్లవి కెరియర్ లో కూడా ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది.
ఈ సినిమా ఇంత పెద్ద ఘనవిజయం సాధించడానికి ప్రధాన పాత్ర పోషించింది ఈ చిత్రం యొక్క కథ అని ఒప్పుకోక తప్పదు.బలమైన కథ ఉన్న ఏ సినిమా కూడా పరాజయం చెందదు.
అలాగే శ్యామ్ సింఘరాయ్ సినిమా కూడా మంచి విజయం సాధించడానికి కథ దానిని మరిచిన తీరే ప్రధానం.సినిమా చూసిన తర్వాత చాలామంది ఈ కథ రాసిన రచయిత చాలా గొప్పవాడు అయ్యుండాలి అని అంతా భావించారు లేదా మంచి అనుభవమైన ఉంటుంది అనుకున్నారు.
కానీ ఈ సినిమా కథ రాసిన వ్యక్తి సత్యదేవ్ జంగా.
అప్పటివరకు కేవలం ఒకే ఒక్క సినిమా కథ రాసిన అనుభవం ఉన్న సత్యదేవ్ తన రెండవ సినిమాగా శ్యామ్ సింఘరాయ్ సినిమా కథ రాశాడు.అయితే ఈ కథ కూడా తాను రాయాలని కానీ, ఎవరైనా అడిగితే ఇవ్వాలని కానీ తయారు చేయలేదు.తాను చేయని తప్పుకు నింద మోసి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ బాధ నుంచి వచ్చిన కథే శ్యామ్ సింఘరాయ్.
సత్యదేవ్ జంగా ఆదిత్య మ్యూజిక్ కంపెనీ లో గత ముప్పై ఏళ్లుగా పని చేస్తున్నాడు.ఎన్నో సార్లు అదిత్య కంపెనీ తరపున వేదికల మీద ప్రసంగించడం మనం గమనించవచ్చు.
అయితే ఆదిత్య లో పని చేస్తున్న క్రమం లో ఒక కంటెంట్ కాఫీ రైట్ వివాదం సత్యదేవ్ చుట్టూ బిగుసుకుంది.ఒక సోకాల్డ్ ప్రొడక్షన్ కంపెనీ కాఫీ వ్యవహారం లో సత్యదేవ్ తో పాటు ఆదిత్య కంపెనీ నీ కోర్టు మెట్లు ఎక్కించారు.
కేవలం తన సినిమా పై బజ్ పెంచడం కోసం ఇలాంటి ఒక పని చేశారు సదరు సినిమా పెద్దలు.ఒకవేళ కేసు ఓడిపోతే డబ్బులు అయిన దక్కుతాయి అయిన ఐదారు కోట్లకు సూ వేశారు.ఎలాగోలా ఈ వివాదం నుంచి బయటపడ్డ దాని తాలూకా ప్రభావం మాత్రం సత్యదేవ్ లో అలాగే మిగిలిపోయింది.అప్పుడే తనలో అణిగిమణిగి ఉన్న ఆ రచయిత నిద్ర లేచాడు.
ఎలాంటి తప్పు లేకుండా కాఫీ కంటెంట్ వివాదం లో ఇరుక్కొని అతడి పడ్డ మానసిక వేదన అంతా ఇంతా కాదు.అలా తనలో ఒక రైటర్ ఉన్నాడనీ సినిమా వచ్చేవరకు తెలియదు.
అంతకు ముందు ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రానికి పని చేశాడు.ఇక శ్యామ్ సింఘరాయ్ తర్వాత ఇంకా కొన్ని కథలను సిద్దం చేస్తున్నాడు.
అతి త్వరలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రకటనకు సిద్ధంగా ఉంది.