వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య తప్పుకోవడంతో మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను రంగంలోకి దించారు.సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి కావడం, ఆయన కుటుంబం పోలీసు కేసులు ఎదుర్కోవలసిన పరిస్థితి రావడంతో సర్వేను అభ్యర్థిగా ఎంపిక చేశారు.
నామినేషన్లకు ఈ రోజే చివరి రోజు.పోటీకి సర్వే నిరాకరించినా బలవంతంగా ఒప్పించారు.
ఆయన వరంగల్ జిల్లా నాయకుడు కాదు.అయినప్పటకీ తప్పలేదు.
వరంగల్ రిజర్వుడు నియోజక వర్గం కావడంతో ఎవర్ని పడితే వారిని ఎంపిక చేయకూడదు కదా.జిల్లా నాయకుడు దొరక్క పోవడంతో సర్వేను నిలబెట్టారు.ప్రస్తుతం చిక్కుల్లో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికలో గట్టెక్కుతుందా అనేది అనుమానమే.