మెగాస్టైలిష్స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరైనోడు’.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.
ఈనెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో పాటు, సినీ వర్గాల వారిని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.ఇంత త్వరగా ఒక స్టార్ హీరో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వడం చాలా అరుదు.
విడుదలకు అంతా సిద్దం అని సెన్సార్ పూర్తి అవ్వడంతో తేలిపోయింది.
అల్లు అర్జున్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మరో ముద్దుగుమ్మ కేథరిన్ తెర్సా కూడా తన అందంతో ఆకట్టుకోబోతుంది.
‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.బన్నీ కొత్తగా ఈ చిత్రంలో కనిపిస్తాడు.
గతంలో ఎప్పుడు చూడని మాస్ యాంగిల్లో బన్నీని ఈ చిత్రంలో చూస్తారు అని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ/ఎ’ సర్టిఫికెట్ను ఇచ్చింది.
మెగా ఫ్యాన్స్ ఈ సినిమా 50 కోట్ల వసూళ్లను దాటడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.