మహబూబ్ నగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.పుల్పోనిపల్లిలో దివ్యాంగునిపై టీఆర్ఎస్ సర్పంచ్ దౌర్జన్యానికి పాల్పడ్డారు.
ఉపాధి హామీ కూలీ డబ్బులు అడిగినందుకు సర్పంచ్ శ్రీనివాసులు దాడికి పాల్పడ్డాడని కృష్ణయ్య అనే దివ్యాంగుడు వాపోయారు.డబ్బులు అడగగానే తీవ్ర కోపోద్రిక్తుడైన సర్పంచ్ కాలితో తన్నుతూ దాడి చేశాడు.
అడ్డుకున్న రెవెన్యూ అధికారులను దుర్భాషలాడాడని ఆరోపించారు.ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.