అల్లు శిరీష్ తన తర్వాత సినిమాకు చాలా సమయమే తీసుకుంటున్నాడు.‘కొత్త జంట’ సినిమా వచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తున్నా కూడా ఈయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు.
వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అల్లు శిరీష్ కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరకు పలు కథలు విన్న శిరీష్ తాజాగా పరుశురామ్ చెప్పిన కథకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.
‘సారొచ్చారు’ సినిమా ఫ్లాప్తో అవకాశాలు లేకుండా ఉన్న దర్శకుడు పరుశురామ్కు అల్లు శిరీష్ అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.మంచి కథతో పాటు ఎంటర్టైనర్గా ఈ సినిమాను దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తాడనే నమ్మకంతో అల్లు శిరీష్ ఈయన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా అల్లు శిరీష్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.ఈ రెండు సినిమాలు కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే నిర్మాణం జరుగనున్నాయి.