టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత సినిమా సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.అదే జోష్ లో ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.
పరశురామ్ పెట్ల ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.అయితే నిన్న ఆగస్టు 9 న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు నుండి టీజర్ వచ్చిన విషయం తెలిసిందే.
పేరుకు తగ్గట్టుగానే బ్లాస్టర్ అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి.అయితే నిన్ననే విడుదల అయినా టీజర్ రికార్డ్ సృష్టించింది.టీజర్ వచ్చిన 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించి సంచలనం రేపింది.ఇప్పటి వరకు తెలుగులో అత్యధికంగా వీక్షించిన టీజర్స్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచి మహేష్ బాబు సత్తా మరొకసారి అందరికి తెలిసింది.
సర్కారు నుండి ఎంతగానో ఎదురు చూసిన అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈ టీజర్ లో మహేష్ బాబు కొత్త లుక్ లో అందరిని ఆకట్టుకున్నాడు.మహేష్ చెప్పిన డైలాగ్స్ కూడా బాగా ఆకట్టు కోవడంతో ఈ టీజర్ సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.
టీజర్ లో వీళ్ళ పెయిర్ కూడా చాలా బాగుందనే ప్రశంసలు కూడా వచ్చాయి.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల చేయబోతున్నారు.మరి చూస్తుంటే ఈ సినిమా కూడా రికార్డ్ సృష్టించేలానే ఉంది.