టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి రికార్డులు క్రియేట్ చేయడం,వాటిని మళ్లీ తానే బ్రేక్ చేయడం కొత్తేమి కాదు.సినిమా ఫస్ట్ లుక్ మొదలు, టీజర్, ట్రైలర్ అంటూ థియేటర్లో బాక్సాఫీస్ మోత మోగించే వరకు ప్రిన్స్ హవా కొనసాగడం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
తాజాగా మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర టీజర్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఇది యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది.
దీంతో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్గా రికార్డ్ క్రియేట్ చేసి… మహేశ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ టీజర్ తో మరోసారి నిరూపితమైంది.
ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కూడిన ఈ వీడియో మహేశ్ బాబు అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
ప్రత్యేకంగా ఇందులో మహేశ్ మరింత యంగ్గా, మరింత స్టైలిష్ లుక్తో కనిపించి ఫ్యాన్స్కి కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట‘.
పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి… తాజాగా మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ ఫొటో బయటికి రాగా ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది.
ఇందులో భాగంగా సినిమాలోని హైలైట్ సన్నివేశాలని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ ఫొటోలో బుల్లెట్ బండిపై అల్ట్రా స్టైలిష్ లుక్స్తో మహేష్ కనిపిస్తున్నారు.చూస్తుంటే ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టు అనిపిస్తోంది.ఇదేంటో తెలియాలి అంటే ‘సర్కారు వారి పాట’ విడుదల వరకు ఆగక తప్పదు.ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.కాగా థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా 2022 జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ చూడాలా అనే కుతూహలం మహేష్ ఫ్యాన్స్ అందరిలోనూ కనిపిస్తోంది.