సూపర్ స్టార్ మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.
ఈ సినిమా మోషన్ పోస్టర్, టైటిల్ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.దీంతో ఈ సినిమాపై కొంత హైప్ క్రియేట్ అయ్యింది.
వరుస హిట్స్ తో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.బ్యాంకులలో రుణాలు తీసుకొని విదేశాలు పారిపోయిన కార్పొరేట్ మాఫియా నేపధ్యంలో ఈ సినిమా కథనం ఉండబోతుంది.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ సినిమా దానికి డిమాండ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.షూటింగ్ ప్రారంభానికి ముందే సగం బిజినెస్ అయిపోతుంది.
మహేష్ బాబు ప్రతి సినిమాకి అదే విధంగా ముందుగా సగం బిజినెస్, అలాగే షూటింగ్ దశలో ఉండగా పూర్తి బిజినెస్ డీల్ క్లోజ్ అయిపోతాయి.
ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతిమ దశలో ఉందని తెలుస్తుంది.
కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే విద్యాబాలన్ కీలక పాత్రలో మొదటి తెలుగు సినిమాలో నటించబోతుంది.
ఇదిలా ఉంటె ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానల్ స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.గీతాగోవిందం తర్వాత పరశురాం నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు సక్సెస్ లలో ఉన్న మహేష్ కాంబినేషన్ కావడంతో స్టార్ మా భయం లేకుండా శాటిలైట్ కొనుగోలు చేసిందని సమాచారం.
అలాగే పుష్ప సినిమా శాటిలైట్ రైట్స్ ని కూడా స్టార్ మా సొంతం చేసుకుందని తెలుస్తుంది.