టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఆయన నటించే సినిమాల గురించి అందరికీ తెలిసిందే.మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా ఏదో ఒక కొత్త విషయాన్ని తెలిసేలా చేస్తాయి.
అంతే కాకుండా ఆయన నటించే సినిమాల్లో తన పాత్రలు కూడా బాగా ఆకట్టుకుంటాయి.మహేష్ బాబు సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటాడు.
ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జోరుగా నడుస్తుంది.ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి తెరకెక్కనుంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.ఈ సినిమాకు థమన్ అదిరిపోయే పాటలను అందిస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మొదటి లుక్ విడుదల చేయగా.
ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సినీ బృందం విడుదల చేస్తున్నాయి.
ఇక ఈ సినిమా విడుదల గురించి సంక్రాంతికి విడుదల చేస్తామని తెలుపగా.డేట్ ను మాత్రం ఫిక్స్ చేయలేదు.
కాగా ఇటీవలే ఈ సినిమా గురించి విడుదల చేసే సమయాన్ని తెలిపారు సినీ బృందం.ఈ సినిమాలు 2022 జనవరి 14న లాక్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చత్రపతి శివాజీ సినిమాలో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా చేయనున్నట్లు రాజమౌళి తెలిపాడు.