సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చుసిన సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ లలోకి వచ్చి తొలిరోజే మిశ్రమ స్పందన అందుకుంది.
అయితే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతుంది.ఇక ఇప్పుడు మూడవ వారంలోకి అడుగు పెట్టింది.మొదటి రోజే ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా మూడవ వారం వరకు ప్రదర్శించ బడుతుంది అంటే మహేష్ స్టామినా ఏంటో తెలుస్తుంది.
అయితే మేకర్స్ చెబుతున్న లెక్కలకు ట్రేడ్ పండితులు చెబుతున్న లెక్కలకు వ్యత్యాసం ఉండడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అనే సందేహం అందరిలో కలుగుతుంది.
ఈ సినిమా 122 నుండి 125 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.యుఎస్ లో ఈ సినిమా 2.4 మిలియన్ డాలర్ల బాక్సాఫీస్ టార్గెట్ ఉండగా రెండు వారాల్లో ఈ సినిమా $2326223 కలెక్ట్ చేయగా ఇంకా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా $75k డాలర్స్ వసూలు చేయాలట.కానీ మేకర్స్ చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి 12 రోజుల్లోనే 200 కోట్ల టచ్ చేసి ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిందని చెబుతున్నారు.అయితే ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం 15 రోజుల్లో ఈ సినిమా 201.32 కోట్లు రాబట్టింది.మొదటి వారంలో 178.50 కోట్లు, రెండవ వారంలో 21.78 కోట్లు, మూడవ వారంలో ఫస్ట్ డే 1.04 కోట్లు వసూలు చేసిందట.
తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్లు మార్క్ టచ్ చేసిందట.కానీ కొన్ని పోర్టల్స్ మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం 13 కోట్లు రాబట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.మరి ఎవరిదీ తప్పు? ఎవరిదీ కరెక్ట్ ? అనేది అర్ధం కావడం లేదు.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందా? లేదా? అనేది కూడా స్పష్టత లేకుండా ఉంది.