టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాను పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో సోషల్ మీడియాలో చుస్తే ఇట్టే తెలిసి పోతుంది.ఈ మధ్యనే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల అయ్యింది.
ఈ టీజర్ చూస్తేనే తెలిసి పోతుంది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ఈ సినిమాలో మహేష్ మరింత యంగ్ గా కనిపించాడు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న నేపథ్యంలో పాటలపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మధ్య థమన్ చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా ఆల్బమ్ పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఒక వార్త అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది.ఇప్పటికే థమన్ మహేష్ బాబు కాంబోలో బిజినెస్ మాన్, దూకుడు, ఆగడు సినిమాలు వచ్చి మ్యూజిక్ ఆల్బంస్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి అయితే ఇప్పుడు రాబోతున్న సర్కారు వారి పాట సినిమా ఈ మూడు సినిమాలకు మించి ఉంటుందట.అంతకు మించి అన్న రేంజ్ లో సర్కారు ఆల్బమ్ ఉంటుందని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.