టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత మహేష్ నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే సస్పెన్స్కు పరశురామ్ రూపంలో రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ను ఫిక్స్ చేయడమే కాకుండా చిత్ర ప్రీలుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు.
అయితే ఈ ప్రీలుక్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కథ ఓ రివెంజ్ డ్రామాగా ఉండవచ్చని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా కథ ఆర్ధిక నేరాల చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ క్రమంలోనే హీరో మహేష్ తండ్రి ఓ బ్యాంక్లో పనిచేస్తాడని, అయితే బ్యాంక్లో జరిగిన ఆర్ధిక నేరాలను తన తండ్రిపై వేయడంతో తన కుటుంబం తీవ్రంగా నష్టపోతుందట.దీంతో ఆర్ధిక నేరగాళ్లపై పగ తీర్చుకునేందుకు మహేష్ ఏం చేశాడన్నది సినిమా కథ ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా కథ నిజంగా సూపర్గా ఉందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.ఇదే నిజంగా సినిమా కథ అయితే మాత్రం మహేష్ మరో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర వర్గాలు.
ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తనదైన శైలిలో సూపర్గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.