టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.
ఇక ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలవడంతో తన నెక్ట్స్ మూవీని లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్.దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీగా ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్తో తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవల ఈ సినిమాను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే సందేహం అందరిలో నెలకొంది.
కాగా ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న కథ కావడం, ఇందులో హీరో తన తండ్రిపై పడ్డ నిందలను చెరిపేందుకు చేసే ప్రయత్నాలను మనకు చూపించేందుకు పరశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఒక విధంగా ఇలాంటి కథలు మనం చాలానే చూశాం.
మరోసారి పాత కథతో వస్తున్న మహేష్, ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడా అనేది ఆసక్తకరంగా మారింది.
ఇక పరశురామ్ ఈ సినిమాను తనదైన మార్క్లో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
పాత కథతో సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో ఆయన సక్సెస్ అయితేనే ఈ సినిమాకు ఆదరణ ఉంటుందని, లేకపోతే పాత చింతకాయ పచ్చడి సినిమాగా బాక్సాఫీస్ వద్ద మిగులుతుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.మరి ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.