టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.గత సంవత్సరం సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ కొట్టి అదే జోష్ లో ఈ సినిమా స్టార్ట్ చేసాడు.
సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది.
ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కించాడు.
సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే అనుకున్న కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్ లోనే చేయాలనీ నిర్ణయించారు.
ఈ సినిమా లో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించబోతున్నారని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎప్పుడు సినిమా ప్రకటించినప్పుడు పోస్టర్ ఒకటి విడుదల చేసారు.అంతే మళ్ళీ ఆ సినిమా నుండి ఇంత వరకు అప్డేట్ రాలేదు.
అందుకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్డేట్ ఇవ్వమంటూ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా నుండి మాస్ మాసాల ట్రీట్ రెడీ చేస్తున్నట్టు టాక్ వస్తుంది.
త్వరలోనే మహేష్ బాబు పుట్టిన రోజు రాబోతుంది.మహేష్ పుట్టిన రోజు కానుకగా ఏదొక ట్రీట్ ఉంటుందని తెలుస్తుంది.దానికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు రాబోతుందంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.మరి ఆ అధికారిక ప్రకటన వస్తుందో లేదో చూడాలి.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.