యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేసిన సంగతి తెలిసిందే.ఈ షో లాస్ట్ ఎపిసోడ్ గా మహేష్ బాబు ఎపిసోడ్ ప్రసారం అయ్యింది.
ఈ షోను ముగించాలి అనుకోవడంతో సూపర్ స్టార్ మహేష్ ను గెస్ట్ గా తీసుకువచ్చి గ్రాండ్ గా ముగించారు మేకర్స్.ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు పాల్గొని హాట్ సీట్ లో కూర్చుని 25 లక్షలు కూడా గెలుచుకున్నారు.
ఈ ఎపిసోడ్ ఎన్టీఆర్ వాక్ చాతుర్యంతో.మహేష్ పంచులతో ఆద్యంతం అలరించిందనే చెప్పాలి.
మీలో ఎవరు కోటీశ్వరులు అన్ని ఎపిసోడ్స్ కంటే లాస్ట్ ఎపిసోడ్ అయినా మహేష్ బాబు ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా నచ్చింది.ఇక ఈ షోలో మహేష్, ఎన్టీఆర్ చాలా విషయాల గురించి చర్చించారు.
అందులో భాగంగా మహేష్ బాబు ప్రసెంట్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గురించి కూడా చర్చకు వచ్చింది.
మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా గురించి ఈ గేమ్ షోలో చర్చకు వచ్చింది.ఇక మహేష్ ఈ సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకోవాలని ఎన్టీఆర్ పట్టుబట్టడంతో మహేష్ బాబు నోరు విప్పారు.
మహేష్ మాట్లాడుతూ.ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఎగ్జైట్ గా ఉన్నాను.ఇక ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ఫ్లేవర్ ఉంటుందని తెలిపాడు.
పరశురామ్ చాలా బాగా వర్క్ చేస్తున్నాడని మహేష్ చెప్పుకొచ్చాడు.పూరీ డైరెక్షన్ స్టైల్, ఎసెన్స్ తో ఈ సినిమా ఉంటుంది.
నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది.అని మహేష్ తెలిపాడు.
ఇంకా మహేష్ నిర్మింస్తున్నా మేజర్ సినిమా గురించి కూడా మహేష్ మాట్లాడారు.అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 26/11 దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్.” ఈ సినిమాలో నా ప్రమేయం చాలా తక్కువ.నేను కొన్ని సీన్స్ మాత్రమే చూసాను.
సినిమా బాగా వచ్చినందుకు టీమ్ ను చూసి నేను గర్వపడుతున్నాను” అని మహేష్ బాబు తెలిపారు.