జనవరి 25 నుంచి సర్కారు వారి పాట మొదలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సర్కారు వారి పాట టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

 Sarkaru Vaari Paata Going On Sets January 25, Tollywood, Telugu Cinema, South C-TeluguStop.com

ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ తో సినిమా కథ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని పరశురామ్ రివీల్ చేశాడు.ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యాంకు లలో రుణాలు తీసుకొని చీటింగ్ చేసిన కార్పొరేట్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది.

ఇక ఇందులో మహేష్ బాబు అమెరికా రిటర్న్స్ ఎన్నారైగా కనిపిస్తాడని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో మెజారిటీ షూటింగ్ అమెరికాలో జరగనుంది.

ఇదిలా ఉంటే ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ చేయాలని అనుకున్న లాక్ డౌన్ ఎఫెక్ట్,కరోనా సెకండ్ వేవ్ కారణంగా పర్మిషన్స్ దొరకలేదు.దీంతో మరో ప్రత్యామ్నాయంగా మొదటి షెడ్యూల్ ని ఇక్కడే హైదరాబాద్ లో స్టార్ట్ చేయడానికి పరశురామ్ రెడీ అయ్యాడు.

దీని కోసం ఒక బ్యాంక్ సెట్ ని కూడా డిజైన్ చేయించారు.

ఇక ఫస్ట్ షెడ్యూల్ డేట్ కూడా ఇప్పుడు ఖరారు చేశారు.

జనవరి 25 నుంచి ఫస్ట్ షెడ్యూల్ లో హైదరాబాద్ లోనే మొదలు పెట్టి తరువాత గోవాలో సెకండ్ షెడ్యూల్ చేస్తారు.నెల రోజుల పాటు ఫస్ట్, సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత మూడో షెడ్యూల్‌ అమెరికాలో చేయడానికి నిర్ణయించారు.

అవకాశాల బట్టి మార్చి ఆఖరున లేదంటే ఏప్రిల్‌ నెలలో 40 రోజులపాటు అమెరికాలో చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తుంది.ఈ మూడు షెడ్యూల్ అనంతరం మళ్ళీ సాంగ్స్ చిత్రీకరణ జరగనుంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.మొత్తానికి ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన సర్కారు వారి పాట ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్తూ ఉండటంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube