టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీగా దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్న ఫిక్స్ చేయగా, గతేడాదే స్టార్ట్ చేయాల్సి ఉన్నా, కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్లు జరుగుతుండటంతో అతిత్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ను అమెరికాలో జరపాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ అక్కడ కరోనా మళ్లీ విజృంభించడంతో హైదరాబాద్లోనే సర్కారు వారి పాట షూటింగ్ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ను దుబాయ్లో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
దీంతో ఈ సినిమా షూటింగ్ ఎక్కడ నిర్వహిస్తారో తెలియని అయోమయంలో ప్రేక్షకులు ఉన్నారు.ప్రతిసారి అక్కడ, ఇక్కడ అంటున్నారే తప్ప ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని వారు అంటున్నారు.
ఏదేమైనా సర్కారు వారి పాట షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా, ఈ సినిమా ఎప్పుడు పూర్తయ్యి రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా ఆర్థిక నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.