సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో బ్రహ్మాజీకి ప్రత్యేక స్థానం ఉంది అనే చెప్పాలి.ఈయన చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.
ఇటీవల ఈయన సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు.వర్మ లాగా తనకు సంబంధం ఉన్న లేకున్నా నచ్చిన ట్వీట్ చేస్తూ వాటిపై రిప్లై ఇస్తూ నెటిజెన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు.
తాజాగా ఆయన నవదీప్ చేసిన ట్వీట్ కు స్పందించాడు.ఇది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.నవదీప్ ట్వీట్ చేస్తూ.ట్విట్టర్ లో ఏం జరుగుతుంది.
ఏంటి విశేషాలు అంటూ పోస్ట్ చేయగా దానికి బ్రహ్మాజీ స్పందించాడు.ఎంతో మంది స్పందించిన బ్రహ్మాజీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.ఆయన నవదీప్ ట్వీట్ కు స్పందిస్తూ.ఈ నెల 12న సర్కారు వారి పాట ఇంకా డిసెంబర్ 6న అవతార్ సినిమాలు విడుదల కాబోతున్నాయి.అంటూ ట్వీట్ చేసాడు.
ఈ ట్వీట్ కు నవదీప్ సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకు వెళ్దామా అంటూ ప్రశ్నించగా.
బ్రహ్మాజీ రిప్లై గా టికెట్స్ ఎలా అంటూ మళ్ళీ ట్వీట్ చేసాడు.డీఎంఈకి నవదీప్ టికెట్స్ ను బాబు గారిని అడిగితే ఇస్తారేమో చూద్దాం అంటే అందుకు బ్రహ్మాజీ మరింత ఫన్నీగా స్పందించాడు.సర్కారు టికెట్ లను చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బాగోదేమో అంటూ ఫన్నీగా చెప్పడం అందరిని ఆకట్టుకుంది.ఈయన ఆన్సర్ కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
మహేష్ బాబు ప్రెసెంట్ సర్కారు వారి పాట సినిమాతో రాబోతున్నాడు.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.