సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సర్కారు వారి పాట’.
ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడగా వారి ఎదురు చూపులు నిన్నటితో తీరిపోయాయి.
నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా సాలిడ్ ఆక్యుపెన్సీ తో స్టార్ట్ అయ్యింది.దీంతో వసూళ్ల పరంగా ఈ సినిమా భారీ నంబర్స్ ను నమోదు చేస్తుంది.
తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో ఎంత వసూళ్లు రాబట్టింది అనే సమాచారం బయటకు వచ్చింది.సర్కారు వారి పాట సినిమా ప్రిస్ట్ డే నైజం ఏరియాలో బాగా వసూళ్లు సంపాదించినట్టు టాక్ బయటకు వచ్చింది.
మరి బయటకు వచ్చిన కలెక్షన్స్ చుస్తే ఇదే అనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో స్టార్ హీరోల సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తాయి.
ఇక తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి.నరిజం ఏరియాలో ఈ సినిమా నాన్ ఆర్ ఆర్ ఆర్ ఓపినింగ్స్ సెట్ చేసి రికార్డ్ లెవల్లో 12.24 కోట్ల షేర్ ని రాబట్టిందట.ఈ నంబర్ చూస్తుంటేనే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఊచ కొత్త స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది.
మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.