సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో తాను నటించబోతున్నట్లుగా కీర్తి సురేష్ ఆమద్య ఒక లైవ్ ఛాట్లో ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ సమయంలో మహేష్బాబుతో నటించేందుకు ఎదురు చూస్తున్నట్లుగా కూడా పేర్కొంది.
దాంతో సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ ఫిక్స్ అంటూ అంతా చాలా నమ్మకంగా చెబుతున్నారు.సినీ వర్గాల వారు కూడా మహేష్ మూవీలో కీర్తి నటిస్తుందనే అంటున్నారు.
కాని నిర్మాతలు ట్విస్ట్ ఇచ్చారు.
సర్కారు వారి పాట చిత్రం హీరోయిన్ విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
కొందరు హీరోయిన్స్ను పరిశీలిస్తున్నాం.త్వరలోనే మహేష్కు సరిజోడీ హీరోయిన్ను ప్రకటిస్తామని అంటున్నారు.
అంటే కీర్తి సురేష్ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మహేష్బాబుకు జోడీగా కీర్తి సురేష్ సెట్ అవ్వదనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్బాబు సినిమాకు ప్రతి సారి కూడా హీరోయిన్ సమస్య వస్తుంది.ఆయన స్థాయి స్కిన్ టోన్కు మ్యాచ్ అయ్యే హీరోయిన్ విషయంలో దర్శకులు ఎప్పుడు కుస్తీ పడుతూనే ఉంటారు.కీర్తి సురేష్ విషయంలో మొదట చర్చలు జరిగినా కూడా ఆమె మహేష్కు నూటికి నూరు శాతం మ్యాచ్ కాదేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అందుకే మహేష్బాబు కోసం ఇంకా మరికొందరు హీరోయిన్స్ను పరిశీలించే పనిలో మేకర్స్ ఉన్నారు.