ఈ ఏడాది సంక్రాంతి పండుగకి థియేటర్లలో పెద్ద యుద్ధం జరగబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎలా అంటే టాలీవుడ్లోని ఇద్దరు ప్రముఖ హీరోల చిత్రాలు ఒకరోజు గ్యాప్ తో వస్తుండడంతో అభిమానులు సంక్రాంతి పండుగతో పాటు సినిమా పండగను కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
అయితే ఇప్పుడు ఆ చిత్ర విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సరిలేరు నీకెవ్వరు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి, ప్రకాష్ రాజ్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.అంతేగాక ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక గీతంలో నటించింది.కాగా ఇప్పటికే ఈ చిత్ర 1.27 నిమిషాల నిడివి గల టీజర్ విడుదలయి మంచి ప్రేక్షకాదరణ పొందింది.ఇందులో భాగంగా యూట్యూబ్ లో 29 మిలియన్ల పై చిలుకు వ్యూస్ తో అదరగొడుతోంది.
అయితే ఇది ఇలా ఉండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా దర్శకత్వం వహించిన టువంటి అల వైకుంఠపురం.ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా బన్నీ సరసన గ్రామర్ డాల్ పూజ హెగ్డే నటించింది.ఈ చిత్రంలో నవదీప్, శశాంక్, సునీల్, మురళి శర్మ, టబు, నివేదా పేతురాజ్ వంటి వారు ప్రముఖ తారాగణంగా నటించారు.
కాగా ఈ చిత్ర ట్రైలర్ కూడా ఇప్పటికే విడుదలై 23 మిలియన్ల పైచిలుకు వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఇద్దరు పెద్ద హీరోలు అయినటువంటి స్టైలిష్ స్టార్, సూపర్ స్టార్ ల చిత్రాలు ఒక రోజు గ్యాప్ తో సంక్రాంతి కానుకగా విడుదల అవుతుండటంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
మరికొందరైతే ఏకంగా సంక్రాంతి పండుగతో పాటు తన అభిమాన హీరోల చిత్రాలు విడుదల అవుతుండటంతో సినిమా పండుగను జరుపుకోవడానికి కూడా గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే ఇదిలా ఉండగా ఈ సంక్రాంతికి కి రెండు భారీ చిత్రాలు పోటీ పడుతుండటంతో పెద్ద యుద్ధమే జరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేగాక ఇందులో ఒకటి యాక్షన్ మరియు ఎమోషనల్ ఎంటర్ టైనర్ చిత్రం కాగా, రెండోది ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులని అలరించబోతున్నాయి.దీంతో ఈ సంక్రాంతి పండుగకి కలెక్షన్ల వర్షం కురుస్తుందని డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
.