సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ను దక్కించుకుంది.అయితే అల వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ ముందు ఇది అంతగా వినిపించలేదు.
కాని సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుందని ప్రతి ఒక్కరు అంటున్నారు.తాజాగా ఈ చిత్రం గురించి సూపర్ స్టార్ కృష్ణ కూడా స్పందించారు.
సినిమా చాలా బాగుందని, నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాడు, దర్శకుడు ఎంటర్టైన్మెంట్తో మెప్పించాడు.
ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం ఉందంటూ కృష్ణ అభిప్రాయ పడ్డారు.
కృష్ణ మాట్లాడిన మాటలను మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోను రీ ట్వీట్ చేసిన మహేష్ బాబు థ్యాంకూ మై సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు అంటూ ట్వీట్ చేయడం అభిమానులను అలరించింది.
వీరిద్దరు కలిసి ఎప్పుడు ఒక స్టేజ్ పైకి వస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అల్లూరి సీతారామరాజు సినిమాకు సంబంధించిన విజువల్స్ను ఈ చిత్రంలో చూపించడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో అల్లరి చేసిన విషయం తెల్సిందే.