మహేష్ బాబు మరియు రష్మిక జంటగా తెరకెక్కిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.విడుదలకు ఇంకా పది రోజులు ఉండగానే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.
సినిమాకు ఇంత త్వరగా సెన్సార్ చేయించడం పట్ల సినిమాపై వారికి ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
భారీ అంచనాలున్న ఈ చిత్రంను అనీల్ సుంకర మరియు దిల్రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
సెన్సార్ బోర్డు నుండి ఈచిత్రం పాజిటివ్ రివ్యూను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
సెన్సార్ బోర్డు సభ్యులు అనధికారికంగా ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్ అంటూ చెబుతున్నారు.ముఖ్యంగా మహేష్ బాబు ఉండే కొన్ని కామెడీ సీన్స్ మరియు మహేష్బాబు మరియు విజయశాంతిల కాంబో సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయి అంటూ సెన్సార్ బోర్డు చెబుతున్నారట.
మొత్తానికి సెన్సార్ పాజిటివ్గా రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంను సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.