మహేష్బాబు సరిలేరు నీకెవ్వరు మరియు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాయి.ఈ రెండు కూడా కొన్ని గంటల వ్యవధిలో కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలను మోస్తున్నాయి.ఈ రెండు సినిమాలపై ఉన్న అంచనాల కారణంగా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయనే నమ్మకంతో బయ్యర్లు ఈ సినిమాలను కోట్టు పెట్టి కొనుగోలు చేశారు.
ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా కలిపి దాదాపుగా 300 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇంత భారీ వసూళ్లను నమోదు చేస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా కేవలం 24 గంటల తేడాతో రాబోతున్నాయి.ఒకసినిమా ఫలితం తారు మారు అయినా భారీ నష్టం తప్పదు.ఒక సినిమా ఫలితం నెగటివ్ అయితే ఇక మరో సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంటే ఆ పాజిటివ్ టాక్ దక్కించుకున్న సినిమా కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం.
ఈ రెండు సినిమాలతో పాటు ఎంత మంచివాడవురా చిత్రం కూడా రాబోతుంది.ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పర్వాలేదు.లేదంటే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు.అంత పోటీలో విడుదల అవ్వడం అంటే మెడపై కత్తి పెట్టుకుని పరిగెత్తడమే.ఏమాత్రం డ్యామేజ్ జరిగినా కత్తి కంఠంను కట్ చేయడం ఖాయం.