టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ తన కెరీర్లో మరో బ్లాక్బస్టర్ మూవీని అందుకున్నాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తరకెక్కిన ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న మహేష్, వసూళ్ల పరంగానూ సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు.
ఇక ఈ సినిమా వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో బుల్లితెరపై కూడా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఇప్పటికే ఒకసారి ప్రసారమైన ఈ సినిమాకు అదిరిపోయే విధంగా 23.4 టీఆర్పీ రేటింగ్ రాగా, ఇటీవల రెండోసారి ఈ సినిమాను టెలికాస్ట్ చేశారు.అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ సినిమా రెండోసారి కూడా 17.4 టీఆర్పీ సాధించి అందరికీ షాకిచ్చింది.అయితే రెండోసారి టెలికాస్ట్ అయిన సినిమాల్లో ఫిదా 18.6 టీఆర్పీ సాధించి టాప్ పొజిషిన్ను సాధించింది.
కాగా రెండో స్థానంలో సరిలేరు నీకెవ్వరు సినిమా అరుదైన రికార్డును క్రియేట్ చేసి మిగతా వారికి చుక్కలు చూపించాడు.మరి ఈ సినిమా మున్ముందు బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి చుక్కలు చూపిస్తుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది.