సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీపై మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.
ఇక పోటీలో మరో సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది.ఈ సినిమా మహేష్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన మూవీగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ఈ సినిమా ఇటీవల 50 రోజులు కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా టోటల్ రన్ను ముగించుకోవడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.129.98 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.ఇప్పటికే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ఫాంపై రిలీజ్ కావడంతో ఈ సినిమా థియేటర్ల నుండి తీసేశారు.కాగా మహేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కేమియో పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం టోటల్ రన్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 34.15 కోట్లు
సీడెడ్ – 14.85 కోట్లు
గుంటూరు – 10.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.59 కోట్లు
ఈస్ట్ – 11.85 కోట్లు
వెస్ట్ – 7.20 కోట్లు
కృష్ణా – 8.85 కోట్లు
నెల్లూరు – 4.05 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 109.59 కోట్లు
కర్ణాటక – 7.55 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.95 కోట్లు
ఓవర్సీస్ – 10.89 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ కలెక్షన్స్ – 129.98 కోట్లు
.