సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తయ్యింది.
ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మనకు కనిపిస్తాడు.అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉండనున్నట్లు మొదట్నుండీ చెబుతూ వచ్చారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమాలో మహేష్ బాబుతో కలుపుకుని ఇతర నటీనటుల రెమ్యునరేషన్ రూ.60 కోట్లు అయ్యిందట.అటు నిర్మాణ ఖర్చు రూ.32 కోట్లు దాటిందట.దీంతో ఈ సినిమా బడ్జెట్ అప్పుడే రూ.100 కోట్లు టచ్ అయినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉన్నాయి.వాటిని కూడా కలుపుకుంటే ఈ సినిమా బడ్జెట్ ఎంతనేది తెలుస్తోంది.
ఏదేమైనా భారీ క్యాస్టింగ్తో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం బడ్జెట్లోనూ భారీగా దూసుకెళ్తోంది.మహేష్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోండగా, లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు మహేష్ అండ్ కో.