సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పలు కొత్త రికార్డులను క్రియేట్ చేయడం విశేషం.
కాగా ఈ సినిమా 8 రోజులు పూర్తి చేసుకునేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.112.03 కోట్ల షేర్ కలెక్షన్లు కొల్లగొట్టింది.ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.మహేష్ యాక్టింగ్కు అనిల్ రావిపూడి టేకింగ్ తోడు కావడంతో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.
రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ఏరియాలవారీగా 8 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 29.80 కోట్లు
సీడెడ్ – 13.25 కోట్లు
నెల్లూరు – 3.32 కోట్లు
కృష్ణా – 7.34 కోట్లు
గుంటూరు – 8.51 కోట్లు
వైజాగ్ – 14.90 కోట్లు
ఈస్ట్ – 9.04 కోట్లు
వెస్ట్ – 6.02 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.92.18 కోట్లు
తమిళనాడు – 1 కోట్లు
కర్ణాటక – 7 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.5 కోట్లు
యూఎస్ – 7.85 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 2.5 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ కలెక్షన్స్ – రూ.112.03 కోట్లు
.