సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో మహేష్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అటు సినిమాకు తొలి రోజే మంచి టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.
పండుగ సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ములేపింది.ఇక ఇదే జోరును కంటిన్యూ చేస్తూ వచ్చిన సరిలేరు నీకెవ్వరు, ఏకంగా 50 రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈ చిత్రం 50 రోజుల రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.146.19 కోట్ల మేర వసూళ్లు సాధించింది.మహేష్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 50 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 40.88 కోట్లు
సీడెడ్ – 16.5 కోట్లు
నెల్లూరు – 4.17 కోట్లు
కృష్ణా – 8.9 కోట్లు
గుంటూరు – 10.90 కోట్లు
వైజాగ్ – 20.38 కోట్లు
ఈస్ట్ – 11.77 కోట్లు
వెస్ట్ – 7.8 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 121.48 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 12.03 కోట్లు
ఓవర్సీస్ – 12.86 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ – 146.19 కోట్లు
.