సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.రిలీజ్కు ముందే ఈ సినిమా మంచి అంచనాలను క్రియేట్ చేయడం, సంక్రాంతి సెలవుల సీజన్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.
ఇక మహేష్ నుండి చాలా రోజుల తరువాత పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ రావడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదిరిపోయే వసూళ్లు సాధించింది.ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లోకి చేరగా, ఈ సినిమా రిలీజ్ అయ్యి 42 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.138.46 కోట్ల మేర వసూళ్లు సాధించింది.ఈ చిత్రంతో మహేష్ తన కెరీర్లో మరో బ్లాక్బస్టర్ను అందుకున్నాడు.రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆమె తన కామెడీతో ప్రేక్షకులను అలరించింది.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ కూడా అదిరిపోవడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో తొలి బ్లాక్బస్టర్గా నిలిచింది.ఇక ఏరియాలవారీగా ఈ సినిమా 42 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 39.85 కోట్లు
సీడెడ్ – 15.64 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.88 కోట్లు
గుంటూరు – 9.98 కోట్లు
ఈస్ట్ – 11.38 కోట్లు
వెస్ట్ – 7.46 కోట్లు
కృష్ణా – 8.93 కోట్లు
నెల్లూరు – 4.06 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 117.18 కోట్లు
కర్ణాటక – 7.52 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.81 కోట్లు
ఓవర్సీస్ – 11.95 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ 42 రోజుల కలెక్షన్లు – రూ.138.46 కోట్లు
.