రాజయ్య కోడలి కేసులో కీలక మలుపు

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక , ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసు కీలక మలుపు తిరిగింది.నిన్నటి వరకు ఇది హత్య అన్న అనుమానం వ్యక్తం చేసిన, ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు ఆత్మహత్య అని తేల్చారు.

 Sarika Committed Suicide: Police Report-TeluguStop.com

పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో సారిక , ఆమె కుమారులది ఆత్మహత్య అని పేర్కొన్నారు.అనేక అంశాలతో సవివరమైన రిపోర్టు తయారు చేసిన పోలీసులు అత్తగారి కుటుంబానికి – సారికకు మధ్య ఉన్న గొడవలను కూడా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా రాజయ్య , ఆయన కుటుంబ సభ్యులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.పథకం ప్రకారమే హత్య జరిగిందన్న ఈ కేసు ఒక్కసారిగా రివర్స్ కావడం ఆశ్చర్యంగా ఉంది.

ఇది ఆత్మహత్యగా తేల్చడానికి పోలీసులకు దొరికిన ఆధారాలు ఏమిటో తెలియాల్సి ఉంది.అయితే ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిగా లేదా ఆత్మహత్యకు కారకులుగా రాజయ్యను, కొడుకును, భార్యను విచారిస్తారేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube