మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక , ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసు కీలక మలుపు తిరిగింది.నిన్నటి వరకు ఇది హత్య అన్న అనుమానం వ్యక్తం చేసిన, ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు ఆత్మహత్య అని తేల్చారు.
పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో సారిక , ఆమె కుమారులది ఆత్మహత్య అని పేర్కొన్నారు.అనేక అంశాలతో సవివరమైన రిపోర్టు తయారు చేసిన పోలీసులు అత్తగారి కుటుంబానికి – సారికకు మధ్య ఉన్న గొడవలను కూడా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా రాజయ్య , ఆయన కుటుంబ సభ్యులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.పథకం ప్రకారమే హత్య జరిగిందన్న ఈ కేసు ఒక్కసారిగా రివర్స్ కావడం ఆశ్చర్యంగా ఉంది.
ఇది ఆత్మహత్యగా తేల్చడానికి పోలీసులకు దొరికిన ఆధారాలు ఏమిటో తెలియాల్సి ఉంది.అయితే ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిగా లేదా ఆత్మహత్యకు కారకులుగా రాజయ్యను, కొడుకును, భార్యను విచారిస్తారేమో.