ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు దర్శకరత్న దాసరి నారాయణ రావు.ఈయన త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా నిర్మించబోతున్న విషయం తెల్సిందే.
మెగా ఫ్యామిలీతో దాసరికి పడదు.అయితే అలాంటి సమయంలో దాసరితో పవన్ సినిమాకు ఎలా బీజం పడి ఉంటుందా అని అంతా భావించారు.
అయితే తాజాగా దాసరి మీడియాతో మాట్లాడుతూ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
పవన్ స్వయంగా తన దగ్గరకు వచ్చి, తనపై ఉన్న గౌరవంతో ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అని అడిగాడు అని దాసరి చెప్పుకొచ్చాడు.
పవన్ మాటలను మొదట పెద్దగా తాను పట్టించుకోలేదు అని, అయితే పవన్ తాను అన్న మాటకు కట్టుబడి సినిమా ఏర్పాట్లు చేస్తుండటం తనకు ఆశ్చర్యంను కలిగించిందని చెప్పుకొచ్చాడు.అందుకే పవన్ కోసం ప్రస్తుతం కథలు వింటున్నట్లుగా దాసరి చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాకు తాను దర్శకత్వం వహించకుండా మరో దర్శకుడి చేతిలో పవన్ సినిమా బాధ్యతను ఉంచనున్నట్లుగా కూడా దాసరి పేర్కొన్నాడు.అయితే ప్రస్తుతం దాసరి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దాసరి వద్దకు పవన్ వెళ్లి సినిమా చేద్దాం అని చెప్పడం ఏంటి, పవన్ వద్ద ఎంతో మంది నిర్మాతలు క్యూలో ఉండగా, ఆయనతో చేయాల్సిన అవసరం పవన్కు ఏంటని అంటున్నారు.మరి కొందరు దాసరి వెళ్లి పవన్ను అడగటం వల్లే ఒప్పుకుని ఉంటాడు, కాని ఇప్పుడు దాసరి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు.