నందమూరి అభిమానులు బాలయ్య సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినా ఇంకా సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో ఉన్నారు.మొన్న శివరాత్రికి ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందని ఎదురు చుసిన ఫాన్స్ కు నిరాశే మిగిలింది.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే పెద్ద అంచనాలే ఉన్నాయి.ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.ఇప్పుడు చేయబోయే సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ సినిమాను తమ ఖాతాలో వేసుకుంటారు.ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన ఈ సినిమా టైటిల్ మాత్రం ఇంకా బోయపాటి రివీల్ చెయ్యడం లేదు.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని దండేలి అడవుల్లో జరుగుతుంది.బోయపాటి ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ అడవుల్లోని షూట్ చేయబోతున్నాడట.ఈ షూటింగ్ ఏప్రిల్ 3 వరకు అక్కడే జరుగ బోతుంది.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కోసం కోలీవుడ్ స్టార్ ను ఫిక్స్ చేసారని సమాచారం.
ఈ సినిమాలో చాలా విలన్ రోల్స్ ఉన్నాయట.ఇప్పటికే కొంతమందిని తీసుకున్న మెయిన్ విలన్ రోల్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నారట.
అయితే ఇప్పుడు ఈ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం అందుతుంది.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలకృష్ణ, ప్రగ్యా ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ గా నటిస్తున్నారు.
పూర్ణ డాక్టర్ గా కనిపించబోతుందట.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను ఉగాది పండగకు అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం.