మన దేశంలోని దాదాపు ప్రతీ గ్రామంలో దేవుడి గుడులు ఉంటాయి.అంతే కాకుండా ఆలయానికి సమీపంలో చెరువులో, వాగులో, కోనేరులో ఉండటం కూడా మనం తరచూ చూస్తూనే ఉంటాం.
ఆలయంలో దేవుడు లేదా దేవత విగ్రహం ఉంటాయి చాలా వరకు.కానీ ఓ చోట మాత్రం దేవత విగ్రహం మాత్రం కేనేరులో కొలువై ఉంది.
అదెక్కడుంది, కోనేరులో ఎందుకు ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు కిళప్పురం ఇల్లం నంబూద్రి అనే భక్తుడికి మగ సంతానం కల్గలేదట.
కాశీకి వెళ్లి గంగలో స్నానం చేస్తే అబ్బాయి పుడ్తాడనే నమ్మకంతో తీర్థయాత్ర మొదలు పెట్టాడట.కాశీకి చేరుకునే క్రమంలో కేరళలోని కొట్టాయంలో ఓ ఆలయానికి వచ్చాడట.ఈ గుడి నచ్చడంతో ఇక్కడే సంవత్సర కాలం ఉండిపోయాడట.రోజూ పూజలు చేసే వాడట.
ఓ రోజు అమ్మవారు కలలోకి వచ్చి నీకు మగ సంతానం కల్గదని.అతడి గ్రామంలో ఓ మహిళ ఇద్దరు కవల పిల్లలకు ప్రసవించబోతోంది… అందులోంచి ఒకర్ని దత్తత తీసుకోమని చెప్పిందట.
అమ్మవారి ఆజ్ఞ పాటించాలని చివరగా కోనేరులో స్నానం చేయాలనుకున్నాడట.కోనేరు మెట్లపై తాటాకుల గొడుగు పెట్టి స్నానం చేసి వచ్చాడట.
తాటాకుల గొడుగు ఎంతకు లేపలేకపోయాడట.పక్కనే ఉన్న స్వామీజి అమ్మవారి శక్తి ఇందులోనే ఉంది.
గుడిలోని విగ్రహం తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలని చెప్పాడట.అలా అమ్మవారు కోనేరులో కొలువై ఉన్నారు.
నాటి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.