అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ‘.ఈ సినిమా లో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.నాగ చైతన్య, సాయి పల్లవి జోడి వెండితెర పై ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇంతకు ముందు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.మరో సారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాలో ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే’ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో.ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలో విడుదల అయినా ‘సారంగ దరియా‘ సాంగ్ అంత హిట్ అయ్యిందనే చెప్పాలి.
సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ తన గొంతుతో ప్రాణం పోసిందనే చెప్పాలి.
ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డ్ సృష్టిస్తుంది.అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద రికార్డ్ సాధించడం అంత సులువు కాదు.కానీ ఈ సాంగ్ తక్కువ సమయంలోనే 300 ప్లస్ మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది.
ఇంకా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయితే మరిన్ని రికార్డ్ లు సొంతం చేసుకోవడం ఖాయం.
ఈ సినిమా విడుదల కోసమే యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ కరోనా వల్ల అంతకంతకు లేట్ అవుతూ వస్తుంది.అయితే ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి మళ్ళీ ఇంత వరకు కొత్త విడుదల తేదీని ప్రకటించ లేదు.
త్వరలోనే విడుదల తేదీని ప్రకటించ బోతున్నారు.మరి చూడాలి ఈ సినిమా అంచనాలను ఎంత మేరకు రీచ్ అవుతుందో.