జానపద గేయాలకు తెలంగాణ పెట్టింది పేరు.అయితే జానపద గేయాలను ఇప్పటి తరానికి తగ్గట్టుగా సినిమాలలో ఉపయోగిస్తున్నారు.
ఇక మామూలు పాటల కంటే ఈ జానపద గేయాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తెలంగాణ జానపదాల్లోని మట్టి వాసన శ్రోతలని మంత్ర ముగ్ధులని చేస్తోంది.
ఎందుకంటే సాధారణ మనిషి జీవితంలోని అపురూపమైన సంఘటనలను జానపద పాటలో పొందుపరుస్తారు.అందుకే జానపద పాటలు విన్నప్పుడల్లా మన గురించి మనం విన్నట్టు మనకు అర్థమవుతోంది.
అందుకే సినిమా దర్శకులు జానపద పాటలను వారి వారి సినిమాలలో పొందుపరచడానికి ప్రయత్నిస్తున్నారు.ఇక అసలు విషయానికొస్తే నాగచైతన్య, సాయిపల్లవి హీరో,హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “లవ్ స్టోరీ“.
ఈ సినిమాలో ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైన జానపద పాట సారంగ ధరియా.సింగర్ మంగ్లీ ఆలపించిన ఈ పాట సినిమా చరిత్రలో కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
యూట్యూబ్ ను, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇప్పటివరకు ఈ పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఈ పాట రికార్డ్ సృష్టించింది.
ఈ పాటలో సాయి పల్లవి స్టెప్పులు ప్రధానకర్షనగా నిలువగా మంగ్లీ పాడటం పాటకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది.అయితే ఈ పాటపై మొదట్లో కొద్ది పాటి వివాదం చెలరేగినా తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల చొరవతో వివాదం సద్దుమనిగింది.