కరోనా కారణంగా మద్యం షాపులకి పరిమితి టైం ప్రభుత్వం విధించడంతో పాటు మద్యం ధరలు రెట్టింపు చేయటంతో మందుబాబులు నాటుసారా వైపు మళ్ళారు.దీంతో విశాఖలో నాటుసారా తయారీదారులు విచ్చలవిడిగా పెట్రేగి పోతున్నారు.
ఈ క్రమంలో నాటుసారా లీటర్ 200 నుండి 300 దాకా ధర పలుకుతోంది.సారా అమ్మకాలకు రూరల్ ఏరియా లో స్థానిక నాయకులు కొంతమంది మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈక్రమంలో విచ్చలవిడిగా నాటుసారా అమ్మకాలు జరుగుతూ ఉండటంతో జిల్లా పోలీసులు నాటుసారా వ్యాపారంపై దృష్టి పెట్టారు.నర్సీపట్నం, చింతపల్లి, అనకాపల్లి, పాడేరు వంటి చోట్ల సోదాలు నిర్వహించి పట్టుబడిన నాటుసారాను పోలీసులు ధ్వంసం చేశారు.
సారా తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ సామాగ్రిని యంత్రాలతో తోక్కించి తగలబెట్టారు.ఈ క్రమంలో కీలక ప్రాంతాలలో పోలీసులు చెక్ పోస్ట్ లు తాజాగా ఏర్పాటు చేసి విశాఖ జిల్లాలో నాటు సారా తయారీ కేంద్రాలపై అరికట్టడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.