సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ ఏడాది అదిరిపోయే ప్రారంభం అందుకున్నాడు.ఇక ఇదే జోష్తో తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేయడానికి మహేష్ అడుగులు వేస్తున్నాడు.
ఇప్పటికే వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమాను కొన్ని కారణాల వల్ల రద్దు చేసుకున్న మహేష్, తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం డైరెక్టర్ పరశురాంతో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అయినా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం చిత్ర యూనిట్కు పెద్ద తలనొప్పిగా మారిందట.ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుందని, ఆమె ఈ సినిమాకు ఖరారైనట్లుగా వార్తలు వచ్చాయి.
ఇక మహేష్తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా ఈ సినిమాలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.ఏది ఏమైనా మహేష్ తన నెక్ట్స్ మూవీని ఎప్పుడు మొదలుపెడతాడా అనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.