సుశాంత్ సింగ్ రాజపుత్.మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
అతను చనిపోయిన సమయం నుంచి ఒకొక్క విషయం బయటపడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అతని డెత్ మిస్టరీ బయటపెట్టే సమయంలో డ్రగ్స్ కోణం కూడా బయటపడి బాలీవుడ్ ని వణికిస్తోంది.
ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ అవ్వగా కోలీవుడ్ లో రాగిణి, సంజనలు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు.ఇది ఇలా కొనసాగుతున్నప్పుడే రియా ద్వారా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ లు విచారణకు హాజరయ్యారు.
ఇక రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే విచారణ చెయ్యగా సారా అలీ ఖాన్ ని కూడా విచారించారు.
ఇక ఆ విచారణలో ఆమె సంచలన విషయాలు చెప్పుకొచ్చింది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరైన ఆమె సుశాంత్ తో కొంత కాలం పాటు ప్రేమలో ఉన్నట్టు థాయ్లాండ్కు పర్యటనలో ఆయనతో కలిసి వెళ్లినట్టు ఆమె తెలిపారు.అయితే అలా వెళ్లిన సమయంలో ఆమె సిగరెట్స్ తాగేది అని.డ్రగ్స్ ఎప్పుడు తీసుకోలేదు అని ఆమె ఎన్సీబీ వర్గాలకు తెలిపారు.
ఇక్కడితో ఆమె ఆగలేదు.
మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజపుత్ భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకునేవాడు అని తెలిపారు.ఇక రియా చక్రవర్తి కూడా గతంలో ఈ విషయాన్నీ వెల్లడించింది.
డ్రగ్స్ కోసమే ఆమెను ఆమె కుటుంబాన్ని సుశాంత్ ఉపయోగించుకున్నాడు అని పలు రియా చక్రవర్తి ఇటీవల ఓ సంచలన విషయాన్నీ బయటపెట్టి అందరికి షాక్ కి గురి చేసింది.కాగా మరోవైపు కరణ్ జోహార్ సంస్థ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పని చేసిన క్షితిజ్ రవి ప్రసాద్ ని వచ్చే నెల 3 వ తేదీ వరకు ముంబై కోర్టు రిమాండ్ విధించింది.