యువ హీరో సంతోష్ శోభన్ రీసెంట్ గానే శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆల్రెడీ సంక్రాంతికి కళ్యాణం కమనీయం సినిమాతో ఆడియన్స్ ని పలుకరించిన ఈ హీరో శ్రీదేవి శోభన్ బాబుతో కూడా మరో ఫెయిల్యూర్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక సమ్మర్ కి మరో సినిమా రెడీ చేస్తున్నాడు ఈ హీరో.ఈసారి నందిని రెడ్డి డైరెక్షన్ లో అన్ని మంచి శకునములే సినిమాతో వస్తున్నాడు సంతోష్ శోభన్.
ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మిస్తుంది.
సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.
నందిని రెడ్డి సినిమా అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ సినిమా అంటే కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
అందుకే సంతోష్ శోభన్ గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఈ సినిమా మాత్రం హిట్ కొట్టడం పక్కా అంటున్నారు.సంతోష్ శోభన్ సినిమాలు థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో ప్రాజెక్ట్ సేఫ్ అవుతున్నాయని తెలుస్తుంది.